Slider తెలంగాణ ప్రత్యేకం

513.70 మీ.కి చేరిన హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం

hussensagar

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో బాటు శివారు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌లో భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఎఫ్‌టీఎల్‌ స్థాయిని దాటింది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుత హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అయితే మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నందున అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Related posts

అఖిల పక్ష సమావేశం జరపకుండా స్టే ఇవ్వండి

Satyam NEWS

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS

స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించాలి

mamatha

Leave a Comment