ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో బాటు హైదరాబాద్ మహా నగరం డేంజర్ జోన్ లో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని, తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు.
పాత సచివాలయం ఉపయోగించుకుంటే 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావచ్చునని కిషన్ రెడ్డి సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.