33.2 C
Hyderabad
April 26, 2024 01: 41 AM
Slider ముఖ్యంశాలు

కరోనా డేంజర్ జోన్ లో హైదరాబాద్

#G Kishan Reddy

ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో బాటు హైదరాబాద్ మహా నగరం డేంజర్ జోన్ లో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని, తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు.

పాత సచివాలయం ఉపయోగించుకుంటే 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావచ్చునని కిషన్ రెడ్డి సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.

Related posts

“ఒక్క ఛాన్స్ ప్లీజ్” అంటున్న అమెరికా అబ్బాయి

Satyam NEWS

“బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ అవ్వాలి: లవ్లీ హీరో ఆది సాయికుమార్

Satyam NEWS

మన హక్కులను మనమే కాపాడుకోవాలి

Satyam NEWS

Leave a Comment