కరోనా నివారణ చర్యల్లో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ట్రాక్టర్ ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల తో పాటు చిన్న చిన్న వీధుల్లో సైతం ద్రావణం పిచికారీ చేయడం జరిగింది.
హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీని సర్పంచ్ కాయిత రాములు పర్యవేక్షించారు.
కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు మాస్కులు లేకుండా బయటికి రాకూడదని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, దగ్గు, జలుబు, జ్వరం,ఒళ్ళు నొప్పులు ఉన్నవారు తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సర్పంచ్ కాయిత రాములు గ్రామస్తులకు సూచించారు.