కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో కొన్ని మీడియాలలొ బీజేపీ తరపున తాను పోటీ చేస్తున్నాను అని చెప్పడం అవాస్తవం అని విజయజ్యోతి అన్నారు.
బిజెపి వాళ్ళు తనను సప్రదించలేదని, జనసేన పార్టీ టికెట్ ఇస్తామని చెప్పినా, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సాంప్రదాయాలు గౌరవించి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి అవకాశం వచ్చినా తాను పోటీ చేయను అని ఆమె అన్నారు.