గత 27 సంవత్సరాలకు పైగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఊసరవెల్లిలా పార్టీలు మారిన వ్యక్తి నాగారపు పాండు తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను పార్టీ నుంచి, కార్మిక సంఘం నుండి తొలగించాలని ప్రకటన చేసిన వ్యక్తి, సిపిఎం పార్టీ పేరు చెప్పుకొని బ్రతికే పాండు తనను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు వింతగా ఉందని సీనియర్ కార్మిక నాయకుడు శీతల రోషపతి హేళన చేశారు.
హుజూర్ నగర్ లోని సీతారాంనగర్ లో శీతల రోషపతి మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న హక్కులను, కార్మికులను కాపాడుకోవాలని,కార్మికుల హక్కుల కోసం,వారి శ్రేయస్సు కోసం త్వరలో ఒక నిర్ధిష్టమైన రాజకీయ ప్రకటనను కార్మిక సంఘాల నాయకులతో కలిసి చేస్తానని రోషపతి తెలిపారు.
కార్మికులతో మాట్లాడుతూ తనపై ఆర్థిక విషయాల ఆరోపణల పైన హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తానికి తెలుసునని, ఆర్థిక విషయాలపై నాగారపు పాండు బహిరంగ చర్చకు సిద్ధమేనా? దీనికి పాండు జవాబు చెప్పాలని అన్నారు. కార్మిక వర్గం అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలు చేసే వారిని వదిలి పెట్టదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల దినసరి కూలీల యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు సాముల కోటమ్మ,మోదల గోపమ్మ,చింతల మంగమ్మ,మున్నీ,స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్