పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని విజయనగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
తన నివాసంలో జరిగిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడారు. . మండలంలో 22 పంచాయతీలు, వార్డు మెంబర్లు గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని… ప్రతి ఓటు కూడా ఎంతో విలువైందని, ఎలా గెలవాలన్న ఆలోచన, ప్రణాళిక రూపొందించుకోవాలి అన్నారు.
పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలు కాబట్టి గ్రామంలో ఇతర పార్టీ సానుభూతిపరులు ఓట్లను కూడా అభ్యర్థించాలని అన్నారు. వార్డు మెంబరు ప్రచారానికి వెళ్ళేటప్పుడు 2 ఓట్లు కూడా తమకు అనుకూలంగా వేయాలని ఓటర్లను అభ్యర్థించా లని అన్నారు.
పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండే విధంగా చూసుకోవాలి అన్నారు.
సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలకు నాంది అని అన్నారు. తన ఎన్నికల విజయానికి ఏవిధంగా సహకరించా రో , తాను కూడా మండల పార్టీ నాయకులకు, పోటీ అభ్యర్థులకు అందుబాటులో ఉంటానన్నారు. పంచాయతీ ఎన్నికలలో అందరినీ కలుపుకుని గెలుపు దిశగా పనిచేయాలన్నారు.
మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన నడిపిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోకల్ గవర్నెన్స్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ కెల్ల త్రినాథ్ తదితరులు మాట్లాడారు. మండల పార్టీ నాయకులు కెల్ల శ్రీనివాసరావు, నారంశెట్టి సత్తి రాజు తో పాటు మండలంలోని ని 22 పంచాయతీల నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.