ఎంతో నిజాయితీపరుడనే పేరు ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం తిరుపతి జేఇఓ గా పని చేస్తున్న బసంత్ కుమార్ పై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేటు వేసింది.
ఆయన చేసిన నేరం ఏమిటంటే కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి మాట్లాడటమే. అది కూడా ఆయన ప్రత్యేకంగా వెళ్లి కలవలేదు.
ఎన్నికల కమిషనర్ తిరుపతి పర్యటన సందర్భంగా కలవడమే ఆయన చేసిన ‘‘అతి పెద్ద’’ నేరం.
తన పరిధిలో లేకపోయినా కూడా బసంత్ కుమార్ ఎన్నికల కమిషనర్ పర్యటనలో పాల్గొనడం పై అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీరియస్ అయింది.
జిఏడిలో రిపోర్టు చేస్తూ….రాష్ట్ర ఎన్నికల సంఘానికి డిప్యుటేషన్ పై పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా పరిశీలకుడిగా కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
బసంత్ కుమార్ ను గుంటూరు లేదా చిత్తూరు జిల్లా కలెక్టర్ గా నియమించాలని ఎన్నికల కమిషనర్ సిఫార్సు చేశారు. బసంత్ కుమార్ బదిలీకి అది కూడా కారణం కావచ్చు.
ఆ పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీవేటు వేసింది.