కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి లోని మారయ్య గారి పల్లె కు చెందిన యువతి డిల్లీ లో ఐఏఎస్ ట్రైనింగ్ చేసి స్వగ్రామంకు రాగా కోవిడ్ 19 టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమె ని 108 లో కడప ఫాతిమా హాస్పిటల్ కు తరలించారు. ఒంటిమిట్ట వైద్య ప్రాథమిక నిపుణులు టెస్ట్ ద్వారా పాజిటివ్ అని వెల్లడయ్యింది.
ప్రైమరీ కాంటాక్ట్స్ లో 11 మంది యువతి ఫ్యామిలీ మెంబెర్స్ గా గుర్తించారు. పాజిటివ్ కేసు వచ్చిన ఇంటి నుంచి 200 మీటర్స్ దూరం కంటైన్ మెంట్ జోన్ విధించారు. ఇంటి నుంచి కంటైన్ మెంట్ జోన్ పరిధి లోపల వున్న ఎవ్వరు ఇంటి నుండి బయటకు రావద్దని, ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు వాలంటీర్స్ ద్వారా ప్రజలకు అందిస్తామని సి.ఐ హనుమంతు నాయక్ ,తాసిల్దారు విజయ కుమారి, వైద్యాధి కారిని కవిత లు ప్రకటించారు.