31.7 C
Hyderabad
April 25, 2024 00: 49 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు

neelam shani

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌ అధికారులను  బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌, చక్కెర పరిశ్రమ  కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్‌ దండేను సాధారణ పరిపాలన శాఖ కు బదిలీ చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, చక్కెర పరిశ్రమ కార్యదర్శి పోస్టు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అప్పగించారు.

ఏపీ ఆగ్రోస్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీగా ఉన్న లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావును కేవలం ఆగ్రోస్‌ ఎండీ పోస్టుకే పరిమితం చేసి, మరో ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్నకు మార్క్‌ఫెడ్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. 

Related posts

బాగా తాగండి: ఏపీలో మందు పాలసీ మళ్లీ మారుతోంది

Satyam NEWS

రికార్డులు మార్చేసి నా భూమి కొట్టేశారు! యువనేత ఎదుట ఓ బాధితుడి ఆవేదన

Bhavani

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చెయ్యాలి

Satyam NEWS

Leave a Comment