ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021కు సర్వం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ ఈ టోర్నమెంట్కు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. అన్ని జట్లు దీని కోసం సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్లో అనుభవాన్ని పొట్టి ప్రపంచ కప్కు ఉపయోగించుకునే పనిలో అన్ని జట్టు నిమగ్నమయ్యాయి.
తాజాగా ఐసీసీ నుంచి ఈ ప్రపంచకప్ థీమ్ సాంగ్ను విడుదల చేసింది. ఈ పాటకు ‘లైవ్ ది గేమ్’అని పేరు పెట్టారు. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో పంచుకుంది. వీడియోలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్లు వీడియోలో కొత్త అవతారంలో కనిపించారు.
యానిమేటెడ్ అవతారంలో వీరు వీడియోలో సందడి చేశారు. అలాగే యువ అభిమానులు టీ20 క్రికెట్ వైపు ఆకర్షితులై తమ అభిమాన ఆటగాళ్లతో ఆడుకుంటున్నట్లు చూపించారు. ఈ పాటలో అవతార్ యానిమేషన్ సరికొత్త ప్రసార సాంకేతికతను ఉపయోగించింది. ఇది 2D, 3D సాంకేతికలను కలిగి ఉంది.