ఏరులై పారుతున్న నాటు సారాను అరికట్టేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొమ్ముగూడెంలో నేడు పెద్ద ఎత్తున దాడులు జరిపి నాటు సారా డెన్ లను ధ్వంసం చేశారు. పోలవరం ఎస్ ఐ, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
ఈ సందర్భంగా 2800 లీటర్ల ఎఫ్ జె వాష్ ను ధ్వంసం చేశారు. రెండు బైక్ లను స్వాధీనం చేసుకుని నునావత్ దుర్గారావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అదే విధంగా గుగులోతు సురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న నాటు సారాను ధ్వంసం చేశారు.