నిజమైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రూరల్ భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కోటిరెడ్డి డిమాండ్ చేశారు.
హుజూర్ నగర్ మండలం లోని బూరుగడ్డ గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో నిజమైన లబ్దిదారుల్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.
ఇలాంటి ఘటనలు మరే గ్రామంలో కూడా జరగకూడదని భారతీయ జనతా పార్టీ కోరుతూ హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం సమర్పించారు.
హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో 35 డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, శ్రీనివాసపురం గ్రామంలో 25 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం 99% పూర్తి అయిందని అయితే లబ్దిదారుల ఎంపికలో అధికారులు విఫలమయ్యారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ఆఫీస్ బేరర్ నాగయ్య, జగన్, రేగళ్ల శీను, విజయ్, తదితరులు పాల్గొన్నారు.