నెల రోజుల నుండి మంత్రులను, ఎమ్మెల్యేలను వదలకుండా రైడ్ చేస్తున్నారు… బిజేపి లో చేరక పోతే ఐటి, ఈడి కేసులు పెడుతాం అని బెదిరిస్తున్నారు… మీరు ఎం చేసుకుంటారో చేసుకోండి తెలంగాణ వాళ్లు భయపడే వాళ్లు కాదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళనం లో నేడు ఆమె పాల్గొన్నారు. బిజేపి చేస్తున్న పని రామ్ రామ్ జప్నా..పరాయి లీడర్ అప్నా… బయటి లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేయడం బిజేపి పని అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నాయకులపై ఈడి, ఐటి లతో కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆమె అన్నారు.
previous post