38.2 C
Hyderabad
April 25, 2024 11: 27 AM
Slider చిత్తూరు

శ్రీకాళహస్తి లో ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

#srikalahasthi

రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి పట్టణం, మాసారపు వెంకటసుబ్బయ్య నగర్ లో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉదయం నుండి ముస్లిం సోదరీమణులతో పాటు  ఉపవాసం చేసిన పవిత్ర రెడ్డి సాయంకాలం ఉపవాస దీక్ష ముగించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు భారీ ఎత్తున ఇఫ్తార్ విందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ని, వారి కుటుంబ సభ్యులను చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.

అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఇప్పటివరకు ఏ శాసనసభ్యుడు ముస్లింలకు ఇంత భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఇవ్వలేదని, మధుసూదన్ రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారని అలాగే నిరుపేద  ముస్లిం కుటుంబాల కల్యాణం కొరకు మేనమామ సాంగ్యం అందజేస్తున్నారని తెలిపారు.

Related posts

‘ఆచార్య’ సినిమా నుంచి ‘భలే భలే బంజారా..’ సాంగ్ రిలీజ్

Satyam NEWS

బిర్యానీలో వెంట్రుకలు వచ్చినందుకు లక్ష జరిమానా

Satyam NEWS

అధికారం కోసం ఆరాటం లేదు… అందుకు పోరాటం లేదు

Satyam NEWS

Leave a Comment