మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి సత్యవతి రాథోడ్ ను హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి ఇగురం కథా పుస్తకం అందజేశారు రచయిత గంగాడి సుధీర్. ఈ సందర్భంగా ఇగురం అనే మాట తెలంగాణ ఆత్మని పట్టిస్తుందని, లంబాడ భాషలోనూ ఇంచుమించు ఇదే పదాన్ని సమానార్ధకం లో వాడతామని అన్నారు. ఇగురం పుస్తకం గురించి విన్నానని ముఖ్యమంత్రి అభినందించిన ఈ పుస్తకం ఖచ్చితంగా చదువుతానన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. భవిష్యత్తులోను గంగాడి సుధీర్ మంచి రచనలు చేయాలని ఆకాంక్షించారు.