ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం, ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నీట్, ఐఐటీ “కోటా” బుక్స్ ను…. పద్మావతి పురం లోని భూమన నివాసం లో గురువారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ బుక్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి విద్యార్ధికి మంచి భోదకుడితో పాటు అత్యుత్తమ మెటీరియల్ కూడా ఎంతో ముఖ్యమన్నారు.ఈ
కార్యక్రమం లో సంస్థ డైరెక్టర్ కే. లలిత్ కుమార్, విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ విశ్వనాథ రెడ్డి, ప్రజానేస్తం ఫౌండర్ నారపరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలు కావాల్సిన వారు www.iitjeeforum.com/books వెబ్సైటు ను సంప్రదించవచ్చు అని లేదంటే వాట్సాప్ నెంబర్ 98490 16661 మెసేజ్ చెయ్యాల్సింది గా లలిత్ కుమార్ తెలిపారు.