ఐఐటీ-జేఈఈ ఫోరం ఆధ్వర్యంలో 9, 10 తరగతులకు వెళ్లే విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రాం ను టెలిగ్రామ్ యాప్ ద్వారా అందించనున్నట్లు ఫోరం డైరెక్టర్ కే. లలిత్ కుమార్ తెలిపారు. ఈ ఆన్ లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఐఐటీ -జేఈఈ కి అవసరమైన కాన్సెప్ట్స్, అసైన్మెంట్స్, గ్రాండ్ టెస్ట్స్, బ్రెయిన్ మ్యాప్స్, వీడియో పాఠాలు ‘టెలిగ్రామ్’ ఛానెల్ ద్వారా పొందవచ్చన్నారు.
ఔత్సాహిక విద్యార్థులు ఇంటర్ పూర్తి అయ్యేవరకు 4 సంవత్సరాల పాటు ఈ సేవలను పొందవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ‘IIT Foundation’ అని టైప్ చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ కు t.me/iitjee_foundation లింక్ ను క్లిక్ చేసి యాప్ లో చేరవచ్చని సూచించారు.