నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రాథోడ్ నేడు పరిశీలించారు. అక్కడ రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ పోసి ఉన్న ధాన్యం రాసులను రమేష్ రాథోడ్ పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేశారని అడిగారు.
అదే విధంగా ఎన్ని లారీలకు, ఎంత మంది రైతులకు డబ్బులు ముట్టినాయని ప్రశ్నించారు. ప్రాజెక్టు డైరెక్టర్ కు అన్ని వివరాలు సిసి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, ఐకెపి కుంట గంగారెడ్డి మహిళ సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు.