కడప జిల్లా నందలూరు మండలం కొనాపురం లో శనివారం అక్రమంగా తయారు చేసిన 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది. కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ నేపథ్యం లో మద్యం దుకాణాలను మూసివేశారు. దీనితో మద్య పాన ప్రియుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు నందలూరు లోని సోమశిల మునక ప్రాంతాల్లో సారా తయారీ మొదలు పెట్టారు.
ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు కోనా పురం లో అక్రమంగా సారా కాస్తున్న ప్రాంతంపై సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని,అమ్మకానికి సిద్ధం ఉన్న 15 లీటర్ల సారని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.