38.2 C
Hyderabad
April 25, 2024 14: 09 PM
Slider కడప

నాటు సారా స్వాధీనం చేసుకున్న పోలీసులు

nandaluru police

కడప జిల్లా నందలూరు మండలం కొనాపురం లో శనివారం అక్రమంగా తయారు చేసిన 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది. కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ నేపథ్యం లో మద్యం దుకాణాలను మూసివేశారు. దీనితో మద్య పాన ప్రియుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు నందలూరు లోని సోమశిల మునక ప్రాంతాల్లో సారా తయారీ మొదలు పెట్టారు.

ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు కోనా పురం లో అక్రమంగా సారా కాస్తున్న ప్రాంతంపై సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని,అమ్మకానికి సిద్ధం ఉన్న 15 లీటర్ల సారని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Related posts

నూతన భవనంలోకి మారుతున్న యూఎస్‌ కాన్సులేట్‌

Satyam NEWS

సినీనటి నిక్కి గల్రాణికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వండి

Sub Editor 2

Leave a Comment