39.2 C
Hyderabad
April 23, 2024 17: 58 PM
Slider ప్రత్యేకం

రాత్రి ఆ నేతతో సెటిల్మెంట్..పొద్దునే బోర్డు పికేసి ఎధేచ్ఛగా నిర్మాణం

#kollapur

తెలంగాణ ప్రభుత్వం 2019 మున్సిపల్ చట్టాన్ని  అమలులోకి తెచ్చిన విషయం  తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని అతిక్రమిస్తూ అక్రమంగా నిర్మాణం చేసిన ఆరంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ను అధికారులు గత ఏడాది మే నెలలో  సీజ్ చేశారు. ఇది నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో జరిగింది.

జిల్లా  కలెక్టర్ ఆదేశాలతో    కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బిల్డింగ్ ను సీజ్ చేశారు. తెలంగాణ 2019  మున్సిపల్ చట్టం ప్రకారం బిల్డింగ్ సీజ్ చేయబడిందని అప్పటిలో ఆ అధికారి చెప్పారు. అంతే కాదు మళ్లీ ఈ బిల్డింగ్ నిర్మాణ కార్యకలాపాలు  నిర్వహిస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. బిల్డింగ్ ముందు సీజ్ అయినట్లు  బోర్డు పెట్టారు. అప్పటిలో అధికారుల విచారణలో తేలింది ఏమంటే చివరికి అక్కడ బోరు కూడా అక్రమంగానే వేశారు.

రాత్రికి రాత్రి అధికార నేత తో సెటిల్మెంట్?..పొద్దునే బోర్డు పీకేశారు

latest photo

సీజ్ అయిన పది నెలల తర్వాత ఓ నేతతో మొన్న రాత్రి ఆ బిల్డింగ్ యజమానులతో  సమావేశమయ్యారని తెలిసింది. వారితో ఏమి లెక్క సెటిల్ చేసుకున్నారో  తెలియదు  కానీ పొద్దునే సీజ్ అయినట్లు ఉన్న బోర్డు పీకేశారు. నిర్మాణ పనులు మొదలు పెట్టారు. హెచ్చరికలను తుడిపేశారు. ఎధేచ్ఛగా షట్టర్లు బిగిస్తున్నారు.

పెయింట్ పనులు చేస్తున్నారు. అయితే మొదటి నుండి ఆ నాయకుడు కోటి పైగానే  డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే దానికి అంగీకరించలేదని మొన్నటి దాకా ప్రచారం జరిగింది… ఇప్పుడు బహుశ బేరం కుదిరి ఉంటుందని కొల్లాపూర్ ప్రజలు అనుకుంటున్నారు.

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం.. అనుమతులు వచ్చే అవకాశమే లేదు

కొల్లాపూర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో సీజ్ అయిన అక్రమ బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలు కావడంతో కొందరు స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు   సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోబోతున్నట్లు చెప్పారు. స్థానిక పోలీస్ లకు కూడా సమాచారం ఇస్తామని చెప్పారు.

ఈ బిల్డింగ్  నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు, రాలేదన్నారు. అక్రమంగా షట్టర్లు వేస్తున్నారని చెప్పారు. ఇది వరకే కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఎలాంటి అనుమతులు రాలేదు. కమిషనర్ లేనందున ఈ విధంగా చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు   పెట్టిన నోటీస్ బోర్డును  తిసేశారని  తెలిసింది.

కచ్చితంగా పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరో అధికారి ఇలా అంటున్నారు….ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఆ బిల్డింగ్ కు అనుమతులు  వచ్చే పరిస్థితే లేదు.అనుమతులు రావాలి అంటే చట్టం మార్చల్సిందే అని చెప్పారు. గత కమిషనర్  వివరణ ఇలా వుంది. బాధ్యతగా విధులు నిర్వహించాము….మా దగ్గర నుండి ఎలాంటి అనుమతులు  ఇవ్వలేదని తేల్చి చెప్పారు.

చుట్టూ రోడ్ వుంది  అనుమతులు రావడానికి ఆస్కారం లేదని చెప్పారు. అయితే ప్రస్తుతం  అనుమతులకోసం చేసే   ఒత్తిళ్ళకు  తట్టుకోలేక   లాంగ్ లీవ్ తో అధికారులు  ఇక్కడి నుండి వెళ్ళిపో తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కమిషనర్ లేని సమయంలో ఈ నిర్మాణం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.

ఈ అక్రమ  బిల్డింగ్ పై వార్తలు రాసినందుకు అక్రమ కేసులు…

గతంలో ఈ బిల్డింగ్ నిర్మాణం  గురించి 2021 మార్చి నెలలో  రిపోర్టర్ అవుట రాజశేఖర్  వెలుగులోకి తెచ్చారు. అధికారుల పరిశీలనలో కూడా ఉన్నది. 2021 మే నెలలో బిల్డింగ్ సీజ్ అయింది. అయితే ఆ బిల్డింగ్   పోలీస్ బెటాలియన్ సమక్షంలో సీజ్ అయింది. ఆ రోజు ఆ బిల్డింగ్ ను కూల్చాలని అందుకే బెటాలియన్ దింపారు.

కానీ అలా జరగలేదు. సీజ్   మాత్రమే అయింది. అయితే అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని వెలుగులోకి తెచ్చిన రిపోర్టర్ పై స్థానిక ఎస్ఐ ప్రోద్బలంతో ఆ బిల్డింగ్ యజమానితో బ్లాక్ మెయిల్ చేసినట్టు  కేసు పెట్టించారు. ఇప్పుడు సీజ్ అయిన కర్షియల్ బిల్డింగ్ పనులు మొదలయ్యాయి. పనులు అలాగే జరుగుతున్నాయి. దీనికి వెనుక ఏమి మర్మం వున్నదో ఉన్నత అధికారులు తేల్చాలి.

Related posts

ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు

Sub Editor

సిగ్నల్ వద్ద లారీ అదుపుతప్పి ఇద్దరు మృతి

Satyam NEWS

ఫిబ్ర‌వ‌రి 12న ‘ఎఫ్‌సీయూకే’ చిత్రం విడుద‌ల‌

Satyam NEWS

Leave a Comment