ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పులిచింతల ప్రాజెక్టు వద్ద చెక్ పోస్టు దగ్గర వాహన తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున మద్యం పట్టుబడింది. తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న ఒక ద్విచక్ర వాహన చోదకుడు అనుమానాస్పదంగా తారసపడగా,ఆ వాహనాన్ని ఆపి గుంటూరు జిల్లా అచ్చంపేట పోలీసులు తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనం వెనుక వస్తున్న ఒక ఆటోని కూడా అదే విధంగా తనిఖీ చేశారు.
రెండు వాహనాల్లో (ఆటోలో 403, ద్విచక్ర వాహనంలో 47 బాటిళ్లు) అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.50,800/- విలువ కలిగిన 450 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ఆటో, ద్విచక్రవాహనాన్నీ సీజ్ చేసి, మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.