పల్నాడు జిల్లా లో జరుగుతున్న అక్రమ రేషన్ దందాపై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను నేడు కలిసిన ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అక్రమ రేషన్ దందా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆయన అనుచరుల కనుసన్నుల్లో నడుస్తుందని చదలవాడ ఆరోపించారు. ఎక్కువ మోతాదులో పట్టుబడితే కేవలం 973 బస్తాలుగా ప్రకటించడం
విడ్డూరమని ఆయన అన్నారు. కిందిస్థాయి అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కూడా రావిపాడు రోడ్ లోని స్వప్న ట్రేడర్స్ మిల్లులో కొన్ని వేల బస్తాలు దొరికితే ఆ కేసును అధికారులు నీరు కార్చారు. ప్రజల పొట్టలు కోట్టి అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి నిందితుల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు