32.2 C
Hyderabad
March 29, 2024 00: 55 AM
Slider గుంటూరు

మద్య నిషేధం డొల్ల మద్యం బాటిళ్లు ఫుల్లు

illicit liquir

మద్య నిషేధం పై పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పడమే గానీ వాస్తవంగా మద్యం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరులో మద్యం సీసాలు లభ్యం అయ్యాయి. పోలీసులు అనుమానం వచ్చి వెతకగా చిరుమామిళ్ళ శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద 115 మద్యం బాటిళ్ళు పట్టుకున్నారు.

అతను ఆ సీసాలను పెదకూరపాడు నుండి అందుకూరు తరలిస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఓకే వ్యక్తి వద్ద 115 సీసాలుండడంతో విస్మయం కలిగిస్తున్నది. వీటి ఖరీదు సుమారు 25 వేలు రూపాయలు ఉంటుంది. ప్రభుత్వ ధుకాణాలలో కేవలం ఒక వ్యక్తికి ఒక బాటిల్ విక్రయాలు జరుపుతుండగా ఇన్ని సీసాలు ఒకే వ్యక్తి వద్ద దొరకడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

దీని వెనుక బడా మాఫియా ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తే పలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related posts

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఎవరో మీకు తెలుసా?

Satyam NEWS

గిన్నిస్ మాన్: ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి కన్నుమూత

Satyam NEWS

గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు: సీఎం

Satyam NEWS

Leave a Comment