గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని ఎక్సయిజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిడుగురాళ్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేయగా ఈ నేరం బయటకు వచ్చింది. గోవిందపురం పడవల రేవు వద్ద, మొర్జంపాడు, పాత గణేష్ ని పాడు గ్రామాలలో దాడులు జరపగా నలుగురు వ్యక్తులు అక్రమ మద్యంతో పట్టుబడ్డారు.
వీరి నుంచి 153 మద్యం సీసాలను ఎక్సయిజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో వారి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గంగిరెడ్డిపాలెం గ్రామనికి చెందిన వ్యక్తులుగా ఎక్సయిజ్ పోలీసులు గుర్తించారు.