ప్రకాశం జిల్లా దొనకొండ కస్తూరిబా స్కూల్ లో గత రాత్రి 14 మంది బాలికలకు అస్వస్థత గురయ్యారు. పిల్లలకు దగ్గు,జలుబు ఉండటం తో ఉపాధ్యాయులు మిరియాలు,పసుపు కలిపిన పాలు ఇచ్చారు.
అవి తాగిన కొంతసేపటికి 14 మంది విద్యార్థులకు వాంతులు కావటంతో పాటుగా నీరసంగా ఉండటంతో అంబులెన్స్ ద్వారా మార్కాపురం ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు. ఆలస్యం ఈ ఘటన వెలుగు చూసింది. జరిగిన సంఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు.