అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి విముక్తం అయ్యారు.
సెనేట్ లో 57 – 43 ఓట్ల తేడాతో ఆయన ను అభిశంసించే తీర్మానం వీగిపోయింది.
అధ్యక్ష ఎన్నికలు పూర్తి అయిన తర్వాత శ్వేత సౌధంపై అల్లరి మూకలు దాడిచేయడం అందులో ఐదుగురు చనిపోవడం తెలిసిందే.
ఈ దాడికి డోనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నారనేది అభియోగం. ఈ అభియోగంపై ఆయనను అభిశంసించాలని సెనేట్ లో చర్చ జరిగింది.
ట్రంప్ ఆ రోజు జరిగిన గొడవలను ప్రోత్సహించలేదని సెనేట్ లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు మిచ్ మెక్ కోన్నెల్ అన్నారు.
డోనాల్డ్ ట్రంప్ ను ఈ కేసుకు సంబంధించి అభిశంసించేందుకు సెనేట్ చేసిన రెండో ప్రయత్నం ఇది. రెండో ప్రయత్నంలో కూడా ట్రంప్ తాను చేసిన నేరం నుంచి తప్పించుకున్నారు.