గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను అన్నివర్గాలకు స్థాపించుకున్నాం. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించనటువంటి రీతిలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం.
కేంద్రం సహకరించకపోయినా నిర్మించుకుంటున్నాం. జగిత్యాలలో కాలేజీని రూ.108 కోట్లతో కళాశాల, వైద్యశాఖలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఛత్తీస్గఢ్లో మాజీ సెక్రెటరీ ఉన్నారు. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆయనపై ఉండే గౌరవంతో ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు. కేరళ రాష్ట్రం కంటే బస్తర్ జిల్లా పెద్దగా ఉందని.. ఆరేడు జిల్లాలుగా విభజించారు. ఒకటే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉందని, భౌగోళిక విస్తృతి బాగుంది.. ఏం చేయమంటారని అడిగితే.. జిల్లాలుగా చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు అడ్మినిస్ట్రేషన్ వెలుగులు వస్తేనే.. ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు’ అని కేసీఆర్ గారు తెలిపారు.
చిల్లరమల్లర రాజకీయాల కోసం పింఛన్లు ఇస్తమా?
‘ఏం చేసినా అర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండాలని పెద్దలు చెప్పారు. 2014లో ఒంటరిగా ఎన్నిలకు వెళ్లాలని నిర్ణయించిన తర్వాత.. మళ్లీ మన గవర్నమెంట్ వస్తుందని ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. రాసే సమయంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలనే చర్చ జరిగింది. రూ.200 ఉన్న పెన్షన్ను రూ.250, రూ.300 చేద్దామని కొందరు చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి లెక్కలు తీసి రూ.430 ఇస్తే చాలని చెప్పారు. ఆ సమయంలో మనం పెన్షన్ ఎందుకు ఇస్తం ? అని అడిగాను. చిల్లరమల్లర రాజకీయాల కోసం ఇస్తమా? పెన్షన్లు ఇచ్చేందుకు పరమార్థం ఉందా? లేదా? అని అడిగినప్పుడు చాలా మంది పాలిటిక్స్, సాయం కోసం ఇస్తామని రకరకాలుగా చెప్పారు.
అనేక కారణాలతో భర్త చనిపోయిన మహిళ, పిల్లల నిరాధారణ వృద్ధులు, నిరుపేదల వృద్ధులు, ఒంటరి మహిళల, ఎవరూ పట్టించుకోకపోయిన బీడీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం అవసరం తీరే విధంగా ఇచ్చినా అర్థవంతంగా ఉంటది, లేకపోతే ఇవ్వకపోవడం మంచిది అని చెప్పాం. ఆ తర్వాత రూ.1000 ఇవ్వాలని చెప్పాని, ఆ తర్వాత పెంచుకుందామని చెప్పామన్నారు. ప్రస్తుతం రూ.2వేలు ఇస్తున్నామన్నారు. టీవీలు, సోషల్ మీడియాలో ప్రత్యక్ష చూశాను. చాలా మంది వృద్ధులు మాకొడుకులు చూడనప్పుడు బావులు, చెరువుల్లో పడి చనిపోదుము. మాకు ఇవాళ ఆ దుర్ఘతి లేదు. రేషన్ కార్డు ఉంది బియ్యం వస్తున్నయ్, రూ.2లు ఠంచన్గా వస్తున్నాయ్ అని మారుమూల ప్రజలు చాలా సంతోషంగా చెబుతున్నారు. ఏలికలకు, పాలకులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దీనికి మంచిన సంతృప్తి, గొప్ప గౌరవంగా ఉంటుందనుకోను’ అన్నారు.
రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నారు..
‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్ చేయచ్చుకదా అని నన్ను కూడా అడుగుతున్నరు. రాష్ట్రంలో 93.50శాతం ఐదెకరాలలోపు రైతులే ఉన్నారు. ఐదు నుంచి పదెకరాలున్న ఉన్న రైతులు ఐదారు శాతం ఉన్నారు. మామిడి, వగైరా ఉన్న వారు ఒకశాతం మాత్రమే ఉన్నారు. 25 ఎకరాలుపైనున్న వారు పాయింట్ 28శాతం మంది ఉన్నారు. వరద కాలువకు తూము పెట్టాలంటే ఒక కథ. నీరు రావాలంటే ఒక కథ. భయంకరమైన పరిస్థితులుండేవి. ఎస్సారెస్పీ ఆయకట్టకు కింద ఉన్న ఆయకట్టులో నీళ్లు రాక పంటలు పండక ఇబ్బందులు పడ్డారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 30-40 ఎకరాలున్న రైతులు హైదరాబాద్, బొంబాయి, బొగ్గుబాయిలో పని చేసే పరిస్థితులు. చెల్లాచెదురై చెట్టుకొకరు.. గుట్టకొకరైన పరిస్థితి.
రైతు సైతం రేషన్కార్డు కోసం అడుక్కునే దుస్థితి. వ్యవసాయ స్థిరీకరణ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగడం వల్ల శాంతి, సౌభాగ్యం పల్లెల్లో అద్భుతంగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన గ్రామీణ ఆర్థిక పునాది పరిపుష్టమైంది. అనేక రంగాల్లో, అనేక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. కమిట్మెంట్ ఉంటే తప్పా పనులు జరుగవు. సిద్ధిపేటగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి అనే పంచాయతీరాజ్ ఇంజినీర్ ఉండేవారు. ఆయన సలహాతో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించాం. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశాం.
దాదాపు 40వేల ఓవర్హెడ్ ట్యాంకులున్నాయి. 17వేలకుపైగా ఉండగా.. కొత్తగా 20వేలకుపైగా నిర్మించాం’ అన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ నీళ్లు అందుతున్నయ్. ఒక్క పథకం వెనుక ఎంత ఆలోచన ఉంటది? విజయవంతం కావాలని దీర్ఘదృష్టి ఉంటుంది. ఆలోచిస్తే అర్థమవుతుంది’ అన్నారు.