28.7 C
Hyderabad
April 20, 2024 05: 18 AM
Slider మెదక్

ముదిరాజులను బి.సి “ఏ” లోకి చేర్చండి

ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని ఈ రోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ముదిరాజులు పెద్దమ్మ దేవస్థానం నుండి భారీఎత్తున గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది ప్రభాకర్ ముదిరాజ్ జండాను ఆవిష్కరించారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా మత్య్సకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం, వైస్ యంపిపి కీసరి పాపయ్య, యం.పి.టీ.సి ల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దత్తు, పిట్ల పర్శరాములు ముదిరాజ్ లు పాల్గొని మాట్లాడుతూ మన ముదిరాజుల హక్కుల కోసం ప్రతి ముదిరాజ్ బిడ్డ ముందు ఉండాలని స్వతంత్ర వచ్చినాక జన గణలో నాటి ప్రభుత్వాలు అన్యాయం చేసి బి.సి డి లో చేర్చారని అందువలన ముదిరాజ్ లు చదువు కొని పట్టాలు తీసుకున్న రిజర్వేషన్లు లేక ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకనే ఆర్థికంగా ఎదగలేకపోతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో చెరుకు పెద్దలు, ఇట్టబోయిన బాలపోషయ్య, కోరమేన అంజయ్య, సుధాకర్, చెరుకు శ్రీకాంత్, ఇట్టబోయిన శేఖర్, కొండెంగలకుంట దేవయ్య, దొంతురబోయిన శ్రీనివాస్, కోరమేన శ్రీనివాస్, పరుకపల్లి ప్రసాద్, కోరమేన యాదగిరి, గుడిపల్లి వికాస్, రెడ్డమేన స్వామి, కొత్త బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో నిలిచిపోయిన డిక్లరేషన్

Satyam NEWS

ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన విజయవంతం చేయండి

Satyam NEWS

పావురాల కుంటకు నీరు తరలింపు

Satyam NEWS

Leave a Comment