29.7 C
Hyderabad
April 18, 2024 05: 53 AM
Slider కడప

కడప జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

#Kadapa Positive

కడప జిల్లా రాజంపేటలో శుక్రవారం మొత్తం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వై బిఎన్ పల్లెలో (42) వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తిరుపతి లో వైద్య పరీక్షలల్లో నెగిటివ్ రాగా, చెన్నైలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. బాధితుడు ఇటీవల తాడిపత్రి వెళ్లి వచ్చినట్లు అక్కడ వారు తెలిపారు.

వారం రోజులుగా జ్వరం ఉండటంతో తిరుపతిలో ఒక ఆస్పత్రిలో పరీక్ష చేయించు కున్నారు. అక్కడ నెగిటివ్ వచ్చింది. కానీ జ్వరం తగ్గక పోవడంతో చెన్నై తీసుకుపోయారు. చెన్నైలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీనితో వై బిఎన్ పల్లె ను రెడ్ జోన్ గా అధికారులు 200 మీటర్ల మేర దిగ్బంధం చేశారు.సి.ఐ శుభకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా ఒంటిమిట్ట మండలం లో కోవిడ్ -19 విజృంభిస్తోంది. మారయ్య గారిపల్లె లో నాలుగు,కొత్త మాధవరం ఒక్కటి, చింతరాజు పల్లె లో ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి.

ఒకేరోజు 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మండల ప్రజలు భయాందో ళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలం లో గత వారంలో రెండు పాజిటివ్ లతో కలిపి ఇప్పుడు సంఖ్య మొత్తం ఎనిమిది కి చేరింది. కాగా ఒంటిమిట్ట సి.ఐ.హనుమంతు నాయక్, వైద్య,రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

గెలిచేవారికి మాత్రమే మునిసిపల్ టిక్కెట్లు

Satyam NEWS

సైకో పాలన పోతేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS

జగన్ తో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రహస్య సమావేశం

Satyam NEWS

Leave a Comment