దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రుతుపవనాలు బలంగా గానీ, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణులు గానీ లేనందున వర్షాలు లేక సూర్యతాపం పెరుగుతోంది.
సాధారణం కంటే ఆదివారం తెలంగాణలో 3.1 నుంచి 5 డిగ్రీల సెల్షియస్ , కోస్తాంధ్రలో 1.6 నుంచి 3 డిగ్రీల సెల్షియస్ అధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ రోజు తెలంగాణలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
ఒడిసాను ఆనుకున్న ఉత్తరాంధ్ర మండలాలలోనూ ఉరుములతో జల్లులు అక్కడక్కడా పడవచ్చునని విశాఖపట్నం వాతావరణ కార్యాలయం తెలిపింది.