34.2 C
Hyderabad
May 19, 2025 17: 27 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

#Hujurnagar Congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో 74వ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ,  జవహర్ లాల్ నెహ్రూ,  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,  సుభాష్ చంద్రబోస్,  భగత్ సింగ్,  సర్దార్ వల్లభాయ్ పటేల్,  లాలాలజపతిరాయ్, ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా నేడు మనందరం  బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని, వారి త్యాగ ఫలితాలను గుర్తు చేసుకోవటం మన బాధ్యత అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, ఐటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి  శివరామారావు యాదవ్,  పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య పాల్గొన్నారు

ఇంకా, కౌన్సిలర్ ములకలపల్లి రామ్ గోపి, వెలిదండ వీరారెడ్డి, బొల్లిదు ధనమ్మ, వేముల నాగరాజు వరలక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి రెడ్డి సంజీవరెడ్డి, ఇట్టి మల్ల బెంజిమెన్, ఎస్కే సైదా మేస్త్రి, కోల మట్టయ్య, దొంతగాని జగన్, సుదర్శన్, బంటు సైదులు, చప్పిడి సావిత్రి, తదితరులు పాల్గొని స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మిఠాయిలు పంచుకొని స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Related posts

తిరుమల చేరుకున్న సిజెఐ జస్టిస్ రంజన్ గొగోయ్

Satyam NEWS

కార్మికులపై దాడిని తిప్పికొడదాం

Sub Editor

కర్నాటక ఆదాయాన్ని మించిన ఆంధ్రా మందు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!