శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధాన ఉపాధ్యాయిని ఎన్ .వి .ఎల్ .కుమారి అధ్యక్షతన జరిగాయి.
పాఠశాల పేరెంట్స్ మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షురాలు పల్ల ధనలక్ష్మి చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ గావించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బి .సూర్యనారాయణ, పీ .ఝాన్సీ లక్ష్మి, డి. రవి బాబు, బీ. సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని అన్నారు. భావి భారత పౌరులైన పిల్లలు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలని వారు సూచించారు.