విజయనగరం జిల్లాలో 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పోలీసు,రెవెన్యూశాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా మువ్వన్నెల మూడు రంగుల జాతీయ పతాకాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎగుర వేసారు.
అదీ ముగ్గురు నారీమణులైన డిప్యూటీ సీఎం, కలెక్టర్ సూర్య కుమారీ ,ఎస్పీ దీపికా ఎం పాటిల్ సమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా పౌర సంబంధాల, సమాచార శాఖ ఏడీ రమేష్…ఆధ్వర్యంలో పలు శాఖల ప్లెక్సీ లను ఏర్పాటు చేసారు.
కరోనా కారణంగా ఆ కరోనా నిబంధనల నడుమ వేడుకలు సాదాసీదాగా శకటాలు లేకుండా జరిగాయి.