ఎందరో త్యాగధనుల త్యాగ ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు.
ఆయన నేడు విశాఖపట్నంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
విశాఖపట్నం ఇన్ చార్జి మార్టిన్ లూథర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.