టీ20 వరల్డ్ కప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యార్థి పాకిస్థాన్పై భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో భారత్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. 10 వికెట్ల తేడాతో భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించి పాకిస్థాన్ సరికొత్త చరిత్రను తిరగరాసింది.
పాకిస్థాన్ జట్టు ఈ రోజు ఆడిన విధానం బాగుంది. మొదట బంతితో శుభారంభించారు. మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లోకి వెళ్లామని, మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయామని కోహ్లీ వ్యాఖ్యానించారు. టోర్నమెంట్లో ఇది మొదటి మ్యాచ్… చివరిదైతే కాదు కదా’ అని చెప్పుకొచ్చారు. ఇలా కోహ్లీ ఓటమిని హుందాగా ఒప్పుకుంటూనే భవిష్యత్తులో జరిగే మ్యాచ్ల్లో రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.