సైనిక సహకారాన్ని అందించుకోవడానికి భారత్ జపాన్ లు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు భారత రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, జపాన్ రాయబారి సతోషీ సుజుకీ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం మేరకు జపాన్ లోని సైనిక స్థావరాలను భారత్ వినియోగించుకోవడానికి వీలుకలుగుతుంది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జపాన్ యుద్ధ క్షేత్రాలలో నిలిచేందుకు, ఇంధనం నింపుకునేందుకు వీలుకలుగుతుంది.
అదే విధంగా జపాన్ కు అవసరమైన సైనిక సహాయాన్ని భారత్ అందిస్తుంది. జపాన్ తో కుదిరిన ఈ ఒప్పందం తో నాలుగు బలమైన దేశాలు సైనిక సహకారానికి ఒప్పందాలు పూర్తి అయింది.
భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు సైనిక సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇది అత్యంత కీలక పరిణామంగా నిపుణులు చెబుతున్నారు.