టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్లో భారత్ విజయకేతనం ఎగరేసింది.
భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 153 పరుగుల టార్గెట్ను సునాయాసంగా చేధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు సాధించాడు.