32.2 C
Hyderabad
March 28, 2024 21: 21 PM
Slider జాతీయం

మొబైల్ యాప్ తో సిద్ధమైన రెడ్ క్రాస్ సొసైటీ

president governor

దేశంలో మరెక్కడా లేని విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  మొబైల్ యాప్ సిద్ధం అయింది. దీన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటన సందర్భంగా హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ నెల 22వ తేదీన సాయంత్రం ఏడున్నర గంటలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విందు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఈ యాప్ ను ఆవిష్కరిస్తారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తొలి పర్యటన కావడంతో  విందు ఏర్పాట్లపై మంగళవారం గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్ అధికారులతో సమీక్ష జరిపారు. భద్రత ఏర్పాట్లతో పాటు ఆతిథ్యానికి సంబంధించిన అన్ని విషయాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన అధికారులను  ఆదేశించారు.

ఈ సమీక్షలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ , ప్రోటోకాల్ అదనపు కార్యదర్శి అరవిందర్ సిoగ్,  జాయింట్ సెక్రటరీ జె భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్లాస్టిక్ వినియోగం మానవాళికి ప్రమాదకరం

Satyam NEWS

మందు కొట్టి బైక్ లు న‌డిపిన‌వారిపై కేసులు బుక్ చేస్తున్న పోలీసులు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలోని అక్ర‌మ ఆటోల‌పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి….!

Satyam NEWS

Leave a Comment