బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఇందిరాగాంధీ పెద్దపీట వేశారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పానగల్ బైపాస్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని అన్నారు.20 సూత్రాల పథకం అమలు,గరిబ్ హటావో నినాదంతో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిందని అన్నారు.
ఇందిరాగాంధీ హయాంలోనే దేశంలోని ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇందిరాగాంధీ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ,ఎంపీపీ మనీమద్దే సుమన్, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్, కౌన్సిలర్లు గడియ హిమబిందు శ్రీనివాస్,
బొజ్జ శంకర్, బుర్రి రజిత యాదయ్య, ఇంతియాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జుకూరి రమేష్, కత్తుల కోటి, పెరిక వెంకటేశ్వర్లు, కోమ్మనబోయిన జానయ్య , సమద్, ఖలీల్, పాశం నరేష్ రెడ్డి, దుబ్బ మధు, జాన్ రెడ్డి, ఆలకుంట నాగరాజు, జూలకంటి సైదిరెడ్డి, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి ,
ఆది మల్ల శంకర్, ఇటికాల శ్రీనివాస్, గాదరి రవి, భాషపాక విజయ్, గాదరి అనిల్, చింత హర్ష, కస్పరాజు వెంకటనారాయణ, కొండా అంజి, అశోక్ , సత్తయ్య, ఆలెక్స్ తదితరులు పాల్గొన్నారు.