అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల ప్రభావం భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఉండదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్ అమెరికాల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చేసుకున్నవి అయినందున ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ వాత్సవ అభిప్రాయపడ్డారు.
తాము కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజల మధ్య పెరిగిన సంబంధాలు, పెట్టుబడులు వాణిజ్యం, రక్షణ రంగం తదితర అంశాలలో అమెరికాతో ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.