ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్రెడ్డి కన్నుమూశారు. కరోనాకు చికిత్స తీసుకుంటూ ఆయన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
రాయలసీమ అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. గతంలో కడప నుంచి 2009లో టీడీపీ ఎంపీగా శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు.
శ్రీకాంత్ రెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవ రెడ్డి కూమారుడు. మోడరన్ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డి పనిచేశారు.