సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మెళ్ళచెరువు మండల కేంద్రంలో మహా సిమెంట్ ఫ్యాక్టరీలో నూతన మైనింగ్ ఏర్పాటు కొరకు 623 ఎకరాల భూమి లిజ్ కొరకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రయా సేకరణ కార్యక్రమనికి శాసనసభ్యుడు శానంపుడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ కృష్ట రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపుడి సైదిరెడ్డి మాట్లాడుతూ సిమెంట్ ఇండస్ట్రీ యాజమాన్యం, స్థానికులకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. జిల్లాలో అత్యధిక సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్ననియోజకవర్గం హుజూర్ నగర్ ఐటీ హబ్ గా నిలవబోతుందని, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కార్యాచరణ ప్రారంభం అయ్యిందని, నియోజకవర్గంలో ప్రతి నిరుపేద కుటుంబంలో ఎవరికైనా చదువు పూర్తె ఉద్యోగ అన్వేషణలో ఉంటే ఇండస్ట్రీ యాజమాన్యాలు వారికి అవకాశం కల్పించి ఆదుకోవాలన్నారు.