రాష్ట్రంలో ఆస్తులు అమ్మేపాలన, అధిక ధరల పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలన, ఆత్మవంచన పాలన, అప్పుల పాలన నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ చైర్మన్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశాడుని ఆయన అన్నారు.
ఒక ఏడాదిలోనే జగన్ 86 వేల కోట్ల అప్పును మన నెత్తిన రుద్దాడని ఆయన తెలిపారు. వైసీపీ ఏడాది పాలన పరమ మొద్దోడి పాలనను తలపిస్తోందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలన పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు ఉందని జగన్ పాలన కంటే పిచ్చి తుగ్లక్ పాలన వంద రెట్లు మేలు అని ఆయన అన్నారు.