తల్లికి కరోనా లేకుండా బిడ్డకు ఆ వ్యాధి సోకి మరణించడం హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. కుతుబ్బుల్లా పూర్ కు చెందిన ఓ మహిళ ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ, క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రసవానికి ముందే తల్లి, బిడ్డకు కరోనా పరీక్షలు చేశారు.
వారి కుటుంబంలో కూడా ఎవరికి కరోనా లక్షణాలు లేవు. ఈ క్రమంలో ఆస్పత్రిలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా, అనుమానం కలిగినా వైద్యులను సంప్రదించాలని సూచించారు.