శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమేన పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1, 40, 585 క్యూసెక్కులు ఉండగా డ్యాం అధికారులు 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1, 52, 801 క్యూసెక్కుల వరద నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.90 అడుగులుగా వుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు, కాగా ప్రస్తుతం 215.3263 టీ.ఎం.సీ లుగా ఉంది.
శ్రీశైలం కుడిగట్టు. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
వెంకట శివుడు