ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఉండటంతో సెల్ ఫోన్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార శాఖ అధికారుల సెల్ ఫోన్ లు బంద్ అయ్యాయి. సెల్ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో సర్వీస్ ప్రొవైడర్ సేవలను నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార శాఖ తో కీలకమైనది. అదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయం ఇది. ఈ సమయంలో ఫోన్లు పని చేయకపోవడంతో సమాచార శాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.