Slider మెదక్

సిద్దిపేట జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు

#SiddipetFloods

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి మధ్యలో ఉన్న వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురుని ఎస్ఐ అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు.

స్థానికుల కథనం మేరకు వీరంతా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు. మంతిని దగ్గర ఇసుక క్వారీలో సూపర్ వైజర్స్ గా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున క్వారీలోకి నీళ్లు రావడంతో అందరూ కలిసి తమ ఇండ్లళ్లకు పోదామని కారులో బయలుదేరారు.

వరద ఉధృతిని అంచనా వేయలేకపోడంతో ప్రమాదం జరిగింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి సీపీ జోయల్ డెవిస్ చేరుకొని పరిస్థిని సమీక్షిస్తున్నారు.  

Related posts

మల్లాపూర్ డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సర్వసభ్య సమావేశం

Satyam NEWS

ఎంప్లాయిమెంటు గ్యారెంటీ నిధులతో చెరువు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!