కోటప్పకొండ వద్ద సినిమా షూటింగ్ రాయల సేనా మూవీ క్రియేషన్స్ వారి ఇన్స్పెక్టర్ ఇంద్ర చిత్రం షూటింగ్ గుంటూరు జిల్లా నరసరావుపేట పరిధిలోని కోటప్పకొండ వద్ద గురువారం ప్రారంభం అయింది. సమాజంలో నిజమైన పోలీస్ ఆఫీసర్ ప్రజలకు ఏవిధంగా సేవలు చేయవచ్చు అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు అందించబోతున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం అశోక్ లోహిత్ వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ డైరక్టర్ ముజీర్ మాలిక్, నిర్మాత తోట నాయూడు, కూర్పు ఉదయ్, ఫైట్ మాస్టర్ విక్కీ,మ్యూజిక్ జయవర్ధన్ అంకె, బాంబే బోలె, హీరో విజయ్ శంకర్, సినీ హీరోయిన్ తెలుగులో తొలి పరిచయం కల్పన షైనీ (బాంబే తార) ఉన్నారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో పాత్రికేయులు దండా గోపి నటిస్తున్నారు.
మిట్ట సాలిగ్రామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. మొదటి షెడ్యూల్ కోటప్పకొండ తదితర పరిసరాల్లో రెండో షెడ్యూల్ చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాలలో,మూడో షెడ్యూల్ వైజాగ్, నెల్లూరు, చెన్నై పరిసరాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్, నార్ల మారుతి బాబు, బజాన్,చిలకలూరిపేట నరసరావుపేట పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా హాజరయ్యారు.