37.2 C
Hyderabad
April 19, 2024 13: 03 PM
Slider ముఖ్యంశాలు

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి కి అవమానం…

#ashok

టీడీపీ వ్యవస్థాపకుడు ,ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి రోజైన 20వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రం లో ఆ పార్టీ కి…అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కు తీవ్ర అవమానం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నగరంలో ప్రముఖుల విగ్రహాలకు పూల దండలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది.మొదట కలెక్టరేట్ జంక్షన్ వద్ద టీడీపీ విగ్రహానికి పూలదండ వేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్… ఆ పార్టీ నేతలు… ఆ పక్కనే పోలీసు కంట్రోల్ రూం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసేందుకు వచ్చారు.

అయితే ఆ కూడలిలో.. ఆ విగ్రహం వద్ద గేట్ తాళం వేసి ఉంది. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని..పార్టీ ..స్థానిక సచివాలయంకు…కార్పొరేటర్ కు తద్వారా మున్సిపల్ కార్పోరేషన్ కు ముందు గానే సమాచారం ఇచ్చారు. అయినా… పార్టీ నేతలు.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ వచ్చిన సందర్భంగా… గేట్ తీయకపోవడంతో తీవ్ర అవమానానికి గురయ్యారు. ఆవేశంతో… తాళం వేసిన గేట్ కు అలాగే విగ్రహాలు ఎదురు గా వచ్చి నమస్కారం చేసి…అక్కడ.. పూలదండ లు తగిలించి…తీవ్ర అవమానం…పరాభవం జరిగిందని పేర్కొంటూ…వెనుదిరిగారు.. అక్కడ నుంచీ నగరంలో కన్యకపరమేశ్వరీ, కోట ,న్యూపూర్ణ, సంగీత కళాశాల, అంబేద్కర్ లకు పూల మాలలు వేసిన అనంతరం… అశోక్ బంగ్లాకు వచ్చిన అశోక్ గజపతిరాజు మీడియా తో మాట్లాడారు. కనీసం మహానుభావులకు కృతజ్ఞతలు చెప్పనివకుండా..తమను బాధ పెట్టారని…ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

యాదాద్రీశ్వరుడి సన్నిధిలో అంబర్ పేట్ కార్పొరేటర్

Satyam NEWS

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Bhavani

నాగర్ కర్నూల్ ఎస్సీ మెనెజ్ మేంట్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment