బిజెపి కార్యకర్తల చేతిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఘోరమైన అవమానం జరిగింది.
కోల్ కతా లోని విక్టోరియా మెమోరియల్ లో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అవమానం జరగడం గమనార్హం. విక్టోరియా మెమోరియల్ లో నేడు నేతాజీ 125వ జయంతి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ ప్రసంగించేందుకు మైకు వద్దకు రాగానే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
ఎంతకూ నినాదాలు ఆగకపోవడం తో మమతా బెనర్జీ వేదిక దిగి వెళ్లిపోయారు. ఇది తనకు అవమానమని ఆమె అన్నారు.
ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఇది రాజకీయ వేదిక కాదు. ఇలా ముఖ్యమంత్రిని పిలిచి అవమానించడం కరెక్టు కాదు. జై బంగ్లా, జైహింద్ అని ఆమె వేదిక దిగి వెళ్లారు.